Hot Posts

6/recent/ticker-posts

నేను చచ్చిపోతే లోకేష్‌దే బాధ్యత: పోసాని కృష్ణ మురళి


ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. తనను హత్య చేయటానికి కుట్ర పన్నుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనపై పరువు నష్టం దావా వేసిన లోకేష్.. కోర్టుకు హాజరయ్యేటప్పుడు చంపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. తనను మంగళగిరి తీసుకెళ్లి చంపబోతున్నారని చెప్పుకొచ్చారు. అయితే.. తాను చచ్చిపోతే మాత్రం నారా లోకేష్‌దే బాధ్యత అంటూ కృష్ణ మురళి ఆక్షేపించారు. తాను లోకేష్‌లా క్యారెక్టర్ లేనివాడిని కాదని క్రెడిబిలిటీ ఉన్న వాడినన్న పోసాని.. తాను కూడా కేసు పెడతాననని చెప్పుకొచ్చారు. లోకేష్ ఎవ్వరినీ విమర్శించలేదా అని ప్రశ్నించారు. బూతు పనుల వల్ల సమాజం పాడవుతుందంటూ చెప్పుకొచ్చారు.


మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడిన బూతుల వీడియోను పోసాని కృష్ణ మురళి ప్రదర్శించారు. నారా లోకేష్ 18 ఎకరాలు కొన్నారని తాను అన్నందుకు.. పరువు నష్టం దావా వేసినట్టు తెలిపిన పోసాని.. దీనికి తనపై 4 కోట్ల పరిహారం, 2 ఏళ్లు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందట అని చెప్పుకొచ్చారు. అయితే.. లోకేష్ చాలా మృదు స్వభావి అని.. కారులో కూడా బైనాక్యులర్స్ పెట్టుకుని చీమలకు సైతం హాని కలగకుండా వెళతారట అంటూ సెటైర్ చేశారు. లోకేష్ అమ్మనా బూతులు తిడితే పరువు నష్టం దావా వేయకూడదా? అని పోసాని ప్రశ్నించారు. తాను పరువు నష్టం దావా వేస్తే లోకేష్ 20 ఏళ్లు జైల్‌లో ఉండాల్సి వస్తుందన్నారు. ఫారిన్ అమ్మాయిలతో మద్యం తాగి, తందనాలు ఆడిన లోకేష్ తనపై పరువు నష్టం కేసు పెడతాడా అంటూ పోసాని మండిపడ్డారు.


మరోవైపు.. అమరావతి రైతులకు పోసాని సవాల్ విసిరారు. తమది చాలా పేద కుటుంబమని.. డబ్బులు లేక తమ నాన్న ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తాను కష్టపడి పైకి వచ్చి సంపాదించానని తెలిపారు. తాను సంపాదించిన ఆస్తినంతా పేద వాళ్లకు ఇచ్చేస్తాననని.. ప్రతిఫలంగా అమరావతి రైతులు కోర్టు కేసులు వెనక్కి తీసుకుంటారా.. అంటూ పోసాని కృష్ణమురళి ఛాలెంజ్ విసిరారు.