Hot Posts

6/recent/ticker-posts

చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ .. లైవ్‌ టెలికాస్ట్‌కు కూడా ఏర్పాట్లు


ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లోనే జాబిల్లిపై అడుగుపెట్టనుంది. జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3.. 45 రోజుల పాటు ప్రయాణించి బుధవారం అంటే ఆగస్టు 23న సాయంత్రం సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. అయితే.. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్‌-3 జాబిల్లిపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే.. విద్యార్థుల కోసం స్కూళ్లు, కాలేజీల్లో లైవ్‌ టెలికాస్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే... దీని వల్ల విద్యాసంస్థల పనివేళల్లో మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో.. ఆ నిర్ణయాన్ని విరమించుకుంది ప్రభుత్వం.



అయితే.. రేపు సాయంత్రం 5.27 గంటల నుంచి.. చంద్రయాన్‌-3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపైకి దిగే ప్రక్రియను ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనుంది. ఈ లైవ్.. వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌, డీడీ నేషనల్‌ ఛానెళ్ల ద్వారా వీక్షించవచ్చు. కాగా.. ఆ లైవ్ స్ట్రీమింగ్‌ను.. తెలంగాణ ఎడ్యుకేషనల్ ఛానెల్స్‌ అయిన టీ-శాట్‌, నిపుణలో లైవ్‌ టెలికాస్ట్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి టీ శాట్‌తో పాటు నిపుణ ఛానెళ్లలో లైవ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై దిగనుండగా.. ఈ అపూర్వఘట్టాన్ని ఇళ్లలోనే విద్యార్థులు వీక్షించేలా తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలంగాణ విద్యాశాఖ కోరింది.


చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ దిగే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను గురువారం రోజున అన్ని పాఠశాలల్లో యూట్యూబ్‌లో విద్యార్థులకు ప్రదర్శించాలని, తరగతి గదుల్లో దీనిపై వారితో చర్చ నిర్వహించాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

మరోవైపు.. యూపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగంలో అద్బుత ఘట్టాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు.ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో.. అన్ని విద్యాసంస్థల్లో.. సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు లైవ్ ఇవ్వనున్నారు.


ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లోనే జాబిల్లిపై అడుగుపెట్టనుంది. జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3.. 45 రోజుల పాటు ప్రయాణించి బుధవారం అంటే ఆగస్టు 23న సాయంత్రం సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. అయితే.. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలని.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మదర్సాలో ముస్లిం విద్యార్థులంతా కలిసి ప్రార్ధన చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేయాలని భారతీయులు ప్రార్థిస్తున్నారు.