Hot Posts

6/recent/ticker-posts

గ్యాంగ్ రేప్ కేసు నిందితులు అరెస్ట్


హైదరాబాద్‌‌లో సంచలనం సృష్టించిన మీర్‌పేట్ గ్యాంగ్ రేప్ కేసును పోలీసులు ఛేదించారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన.. గంజాయి బ్యాచ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. ఈ కేసులో సంచలన విషయాలను రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. అందులో ప్రధాన నిందితుడైన అబేద్ లాల్ ఓ రౌడీషీటర్‌‌ అని చౌహాన్ తెలిపారు. నిందితులందరూ గంజాయి తీసుకుని.. ఆ మత్తులోనే బాలికను బెదిరించి.. దాడి చేసి మరీ అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ కేసులో ఏ1 అబేద్‌ బిన్‌ ఖాలీద్‌, ఏ2 తెహసీన్‌, ఏ3 మాంకాల మహేష్‌ కీలక నిందితులు కాగా.. వీళ్లకు ఏ4 నర్సింగ్, ఏ5 అశ్రఫ్, ఏ6 ఫైజల్, ఏ7 ఇమ్రాన్ సహకరించినట్టు పేర్కొన్నారు.



అయితే.. తండ్రి మరో పెళ్లి చేసుకోవటంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి సోదరి వరుసయ్యే బంధువు వారి ఆలనాపాలన చూసుకుంటోంది. అయితే.. తన అక్క ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే.. బాధిత బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసముంటోంది. ఈ క్రమంలోనే గంజాయికి బానిసలైన అబేద్ గ్యాంగ్.. అమ్మాయిపై కన్నేశారు. ఇదే క్రమంలో గంజాయి మత్తులో తూగుతున్న నిందితులు.. ఆమె ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి.. తన తమ్ముడిని కత్తితో బెదిరించారు. అబేద్.. బాధితురాలి జుట్టు పట్టుకుని బెడ్ రూంలోకి ఈడ్చుకెళ్లి.. ఆమె నోరు మూసి అత్యాచారం చేశాడు. ప్రతిఘటిస్తే దాడి చేశాడు. ఆ తర్వాత కత్తితో బెదిరించి ఒకరి తర్వాత ఒకరు.. మొత్తం ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ముగ్గురు బయట కాపలా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తెలిసింది. కాగా.. అత్యాచారం సమయంలో బాధితురాలి తమ్మున్ని నర్సింగ్, అశ్రఫ్ బెదిరించారు.


ఈ విషయం తెలియగానే.. వెంటనే కేసు నమోదు చేసి.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నామని.. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దర్యాప్తు చేపట్టామని సీపీ చౌహాన్ తెలిపారు. అయితే.. అత్యాచారం విషయం బయటికి రావటంతో.. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఫైజల్, ఇమ్రాన్‌ సహకరించారు. తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ పడేసి సిగ్నల్ దొరకకుండా పరారయ్యారు. కాగా.. నిందితులు అమ్రాబాద్ పారిపోతుండగా అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు. మరో నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని.. అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.