Hot Posts

6/recent/ticker-posts

మొక్కజొన్న క్వింటా మద్దతు ధర రూ. 1962/


 ఏలూరు: జిల్లాలో రబీ సీజన్ లో పండించిన మొక్కజొన్నను క్వింటాకు మద్దతు ధర రూ. 1962  కొనుగోలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లోని జేసి ఛాంబర్ లో  జాయింట్ కలెక్టర్ అద్యక్షతన జిల్లాస్ధాయి కొనుగోలు కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2022-23 రబీ సీజన్ లో సాగుచేసిన మొక్కజొన్నను రైతు భరోసా కేంద్రాల్లో మార్కెఫెడ్ ఆధ్వర్యాన కొనుగోళ్లు ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగిందన్నారు.  మొక్కజొన్న విక్రయించాలనుకునే రైతులు తమ సమీప రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవడంతోపాటు పంట శాంపిల్స్ తీసుకువచ్చి నాణ్యతా ప్రమాణాలతో సరిచూచుకోవాలన్నారు.  శాంపిల్స్ పరిశీలన, ఈ-క్రాప్, ఈ-కెవైసి నమోదైన రైతులను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు.  ఇతర వివరాలకు తమ తమ రైతు భరోసా కేంద్రాల వద్ద సంప్రదించాలన్నారు. 

కావున రైతులందరూ మే, 12వ తేదీలోపు (12.05.2023) తమయొక్క పేర్లను నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.   ఈ అవకాశాన్ని మొక్కజొన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేసి కోరారు.