Hot Posts

6/recent/ticker-posts

చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. 7వ విడతలో 21,048 మంది లబ్ధిదారులకు రూ . 22.66 కోట్లు వడ్డీలేని రుణాలు


 డిసెంబర్ 2022 వరకు 19,627 మంది లబ్ధిదారులకు రూ .42 లక్షలు వడ్డీ రాయితి


ఏలూరు జిల్లా, ఏలూరు: చిరువ్యాపారులు, సాంప్రదాయ వృత్తులవారి ఉపాధికి ఊతంగా జగనన్న తోడు నిలుస్తోందని జిల్లా కలెక్టర్ వె . ప్రసన్న వెంకటేష్ అన్నారు. మంగళవారం జగనన్న తోడు పథకం 7వ విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించినవారికి సంబంధించిన వడ్డీ రాయితీని నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమచేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్ . జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వె . ప్రసన్న వెంకటేష్, జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు, జాయింట్ కలెక్టర్ పి.లావణ్య వేణి, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, మెప్మా పిడి ఇమ్మనియల్, పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె . ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ చిరువ్యాపారులు సాంప్రదాయ వృత్తులవారికి జగనన్న తోడు అపన్న హస్తంగా నిలుస్తోందన్నారు. జగనన్న తోడు పథకం 7వ విడత కింద ఏలూరు జిల్లాలో 21,048 మంది లబ్దిదారులకు రూ.22.66 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. అదే విధంగా జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 19,627 మంది లబ్దిదారులకు రూ.42 లక్షలు వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద లబ్దిదారులకు జమచేయడం జరిగిందన్నారు. చిరు వ్యాపారాలు చేసుకొనే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద అండగా నిలుస్తోందన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే వడ్డీ రాయితీ తోపాటు తిరిగి వడ్డీలేని రుణాలు పొందవచ్చన్నారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతు జిల్లాలో ఈ విడతలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరువ్యాపారాలు చేసుకునే 16,448 మందికి  వడ్డీలేని రుణాలు మంజూరు అయ్యాయన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతంలో 4,600 మందికి ఈ పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తులేకుండా  లబ్దిదారులకు రుణాలు అందిస్తున్నదన్నారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు వారీ జీవితాల్లో మార్పు తీసుకు వస్తుందన్నారు.